నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను, మెగాలోక్ అదాలత్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ జడ్జీ పి.బి కిరన్ కుమార్ మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతం అయితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని, మహిళలే సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధి కి దోహదపడుతుందని అన్నారు. దేశంలో అన్నిరంగాలలో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ లు జి.స్వాతి, పద్మ సాయిశ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, ఏజీపీ గుర్రం శ్రీనివాస్, సిఐ లు తిరుమల్ గౌడ్, వి. రవి, బార్ అసోసియేషన్ కార్యదర్శి మట్టెల తిరుపతి, లోక్ అదాలత్ సభ్యులు వై. అరుణ్ కుమార్, కోర్టు సిబ్బంది, కోర్టు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.



