నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఘన్ పూర్ నియోజక వర్గంలోని శివుని పల్లి లో ఉన్నందున వాహన దారులకు సూచనలు చేశారు. వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చే వాహనాలు లక్ష్మి వెంచర్ లో మరియు లక్ష్మీ రైస్ మిల్ వెనక భాగంలో పార్కింగ్ చేయాలని సూచించారు. ఇట్టి బందో బస్తులో ముగ్గురు డిసిపిలు 2 అడిషనల్ డీసీపీ లు , 20 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, మరియు మొత్తం 850 పోలీస్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది.





