నేటిసాక్షి /వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రగల్లపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మరియు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ వారి ఆదేశాలతో ప్రగల్లపల్లి వైద్యాధికారి గ్యానస ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు మధుమేహం పాత వ్యక్తులు మరియు అనుమానితులు వారి గ్రామంలో ఆరోగ్య మందిర్ వచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు కొరకు తెమడ సేకరించి వెంకటాపురం ల్యాబ్ కు తీసుకు వెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి గ్యానస వైద్య సిబ్బంది వెంకటేశ్వరావు రజనీకాంత్, కోటిరెడ్డి కన్యాకుమారి, రాజేశ్వరి
గ్రామస్తులు పాల్గొన్నారు.





