నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 94వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం గోడపత్రిక ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ మాట్లాడుతూ, వీరి త్యాగాలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగెం మధు, ఏఐవైఎఫ్ నాయకులు రొడ్డ లక్మన్, రోడ్డ చరణ్, సంగెం సతీష్, దార్ల సంపత్, గుబిరే సాయి చంద్ర, శంకర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.





