నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల ప్రధాన కూరగాయల మార్కెట్ విద్యానగర్ పరిధిలో రైతులు తమ కూరగాయలను రోడ్లపై అమ్మడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పలుమార్లు ప్రజావాణిలో పిర్యాదులు రావడంతో స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ వారి సిబ్బంది తో కలిసి మార్కెట్ నీ పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులు, వ్యాపారస్తులతో మాట్లాడి, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విద్యానగర్ ప్రజలు ఎస్ఐ మల్లేష్ స్పందించిన తీరుకి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్ల పై కూరగాయలు పెట్టవద్దని వ్యాపారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ వ్యాపారం చేసుకోవాలని అయిన తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

