నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…..ఈ రోజు ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస స్కూల్స్ విద్యార్థులు తమ చేతిలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని వీధులలో తిరుగుతూ ప్రజల్లో కాలుష్యంపై అవగాహన కల్పించారు. పటాకులు కాల్చడం వల్ల గాలి మరియు శబ్ద కాలుష్యం పెరుగుతుందని, ఇది మన ఆరోగ్యానికి హానికరమని ప్రజలకు వివరించారు.పర్యావరణ హితంగా దీపావళిని జరుపుకోవాలని, పటాకుల వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులు సందేశం ఇచ్చారు.ఈ ర్యాలీలో పాఠశాల కరస్పాండెంట్ బోగ రవి ప్రసాద్ – శ్రీదేవి గార్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.




