నేటి సాక్షి, బెజ్జంకి: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు.పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని ,సీఎం సహాయనిధి నీ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ,తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపిడిఓ ప్రవీణ్,నాయకులు బైర సంతోష్,లింగాల శ్రీనివాస్,కొంకటి రాములు తదితరులు పాల్గొన్నారు




