నేటి సాక్షి చిలుకూరు మండలం చిలుకూరు మండల కేంద్రంలో ఈరోజు బీసీ బందులో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మిత్రపక్షాలు కలిసి కోదాడ హుజూర్నగర్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.. తెలంగాణ రాష్ట్ర బీసీ బందు పిలుపుమేరకు అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ పార్టీలు కూడా మద్దతు తెలిపి కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఈరోజు చిలుకూరు బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు . కిత. వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి అనుమాంతరావు. వివిధ పార్టీల గ్రామ శాఖ అధ్యక్షులు మరియు నాయకులు. కార్యకర్తలు బీసీ సంఘాల నేతలు. పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.




