నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………*జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారి పై నేరెళ్ల వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు తప్పిన భారీ ప్రమాదం..పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఊడిపోయిన బస్సు టైరు… డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం*ధర్మపురి నుంచి జగిత్యాల కు బయలుదేరిన బస్సులో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఓవర్ లోడ్ తో బస్సు వెనక టైరు ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు వేగంగా ఉన్నా ఎదురుగా వేరే వెహికల్స్ వచ్చిన ప్రమాదం జరిగేది. 60 నుంచి 70 మంది ప్రయాణించాల్సిన బస్సులో అడుగు తీసి అడుగు వేయకుండా వందమందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుండడంతో ఓవర్ లోడ్ వల్ల టైర్ ఓడిపోయిందని డ్రైవర్ తెలిపారు.





