నేటి సాక్షి( జిన్నారం)బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ కాలనీ వ్యవస్థాపకులు, మాజీ వార్డు సభ్యులు స్వర్గీయ మల్లారెడ్డి గారి 23 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. మల్లారెడ్డి కుమారుడు మాజీ వార్డు సభ్యులు, సీనియర్ నేత బొల్లారం యాదిరెడ్డి , మల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి అభిమానులు, కార్యకర్తలు మాట్లాడుతూ బొల్లారం అభివృద్ధి లో ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డిజైర్ సొసైటీ లో అనాథ పిల్లలు కు అన్నదానం కార్యక్రమం.





