నేటి సాక్షి, ప్రతినిధి అక్టోబర్ 25: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాల కోసం ఈనెల 30అక్టోబర్ లోగ దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోగలరని నల్లబెల్లి మండల వ్యవసాయ అధికారి బన్ను రజిత అన్నారు. వాటి వివరాలు:బ్యాటిరి స్పియర్స్-147, పవర్ స్ప్రేయర్- 31,ట్రాక్టర్ పని ముట్లు, బ్రష్ కటర్స్-02 పవర్ వీడర్లు -01 మరియు స్ట్రా బేలర్ -02,పవర్ టిల్లర్- 01 కావలిసిన రైతులు రైతు వేదిక, నల్లబెల్లి లో దరఖాస్తుకు సంప్రదించగలరనీ మనవి లేదా మీ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు సమర్పించగలరు. SC ST రైతులకు జనరల్ మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ,ఇతరులకు 40శాతం సబ్సిడీ ఉందంటూ తెలిపారు. పూర్తి వివరాలు కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించగలరని. ఆసక్తి వున్నా రైతులు దరఖాస్తు ఫారం నింపి దానితోపాటు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్,పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ను జత చేసి సమర్పించలి అని ఏవో రజిత తెలిపారు.





