నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)సీనియర్ జర్నలిస్ట్ ఓంప్రకాష్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డిలు సోమవారం తిరుపతి ఎన్జీవోకాలనీలోని ఓంప్రకాష్ నివాసానికి వెళ్లి ఆయన మృతికి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నివాళుర్పించిన వారిలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీరేంద్ర వర్మ, కార్పొరేటర్ లడ్డూ భాస్కర్, కోటి ఉన్నారు.





