( నేటి సాక్షి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర నాయకుడు శివ ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం మాగంటి సునీత కార్యాలయంలో ఆమెకు శివ ప్రకాష్ బొకే ఇచ్చి, మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శివప్రకాష్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఓటర్లు బిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, భారీ మెజార్టీతో మాగంటి సునీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాగంటి వాత్సల్యనాథ్, కళ్యాణ్, శరత్, రాజు, చిరంజీవి, కృష్ణ, సాయి ఉన్నారు.





