Sunday, March 15, 2026

*పేదల సొంతింటి కలను నెరవేర్చుతాం: కిచ్చెన్న**ఎన్టీఆర్ నగర్ వాసులకు హామీ ఇచ్చిన లక్ష్మారెడ్డి* *..

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం సెప్టెంబర్ 01:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం కల్పిస్తూ… అండగా నిలుస్తున్నామని కేఎల్ఆర్ తెలిపారు.ప్రజాపాలనలో అందరికీ ఇడ్లు, రేషన్ కార్డులు, విద్య, ఆరోగ్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు కిచ్చెన్న.త్వరలోనే ఎన్టీఆర్ నగర్ వాసులకు డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు చేసి మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి గృహప్రవేశం చేయిస్తానని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News