నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 4మండలంలోని పంచాయతీ కేంద్రం చారాల ఉన్నత పాఠశాలలోని పలువురు విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు చౌడేపల్లి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రూ 10 వేల క్రీడా దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ క్రీడలు మానసిక శారీరక ధృఢత్వాన్ని ఇస్తాయన్నారు క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రేణుక గ్రామీణ బ్యాంకు సిబ్బంది ప్రవీణ్ సత్య మౌళి చందు తేజ సాయి హర్ష పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేంద్ర పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సహదేవయ్య నాగరాజ రెడ్డి నారాయణ రమణబాబు సుబ్రహ్మణ్యం మార్కండేయ వరలక్ష్మి కుసుమ ప్రతిమ వీణ రూబీ రత్నమ్మ శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు





