నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)కర్లపాలెం పంచాయతీలోని టీడీపీ పార్టీ కార్యకర్త కనమర్లపూడి అజయ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా నామిని అయిన వారి అమ్మగారికి 5 లక్షలు రూపాయిల చెక్కు అందజేశారు.ఈ సందర్భంగా టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు మాట్లాడుతూ పార్టీకి వెన్నంటి ఉండి నడిచిన వారిని కష్టకాలంలో టీడీపీ పార్టీ ఆదుకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజి,ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాష,జడ్పీటీసీ పిట్ల వేణుగోపాలరెడ్డి, కుమ్మరికుంట దాస్,బుల్లియ్య,పిట్ల వసంతరెడ్డి,కట్టా సుజాత,బొద్దుకురి విజయ తదితరులు పాల్గొన్నారు.





