నేటి సాక్షి అనంతగిరి, మండల కేంద్రంలో తెలంగాణా శబరిమలగా పేరుగాంచిన అనంతగిరి శ్రీ అయ్యప్ప సన్నిధిలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సూచనలతో దీక్షా ధారణ స్వాములకు నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ ముప్పైఒకటవ (31) రోజు సుమారుగా 350 మందికి పైగా స్వాములు బిక్ష స్వీకరించినారు.గురువారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి దాతలుగా ఖానాపురం వాస్తవ్యులు ఆశీర్వాదం గురుస్వామి,కోటమ్మ దంపతులు వారి కుమారుడు రాహుల్ వ్యవహరించినారు.ఈ కార్యక్రమంలో కొండపల్లి వాసు గురుస్వామి, కుందురు జైపాల్ రెడ్డి,ప్రసాద్, భూపతి రావు, గింజుపల్లి సురేష్, గింజుపల్లి రఘు, జగన్, కనగాల వీరయ్య, స్వాములు ,తదితరులు పాల్గొన్నారు..





