*నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……………………………………..జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ( టిఎస్జేయూ ) జగిత్యాల జిల్లా అధ్యక్షులు డా. పేట భాస్కర్, ప్రధాన కార్యదర్శి జోరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాలో నూతన కమిటీ ఎన్నికైన సందర్బంగా కమిటీ నాయకులతో కలిసి జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి పూల బొకే అందజేశారు. ఈసందర్భంగా జర్నలిస్ట్ లకు సంబందించిన పలు అంశాలపై, సమస్యలపై విన్నవించగా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దీకొండ మురళి, తనుగుల అజేయ్, బి మల్లారెడ్డి, కార్యదర్శి కోయాల్కర్ నరేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొమ్మేన శ్రీహరి, జిల్లా నాయకులు మాడపతి ప్రమోద్, జెంజురు గంగాధర్ , పి కుమార స్వామి, గంగాధర మధు తదితరులు పాల్గొన్నారు.




