(నేటి సాక్షి )కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని, నవంబర్ 13 గాజులరామారం భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఈ నెల 16వ తేదీ ఆదివారం భారీ స్థాయిలో రెడ్డీ కార్తీక వనభోజనాలు నిర్వహించబడనున్నాయి.ఈ సందర్భంగా నిర్వాహకుల్లో ఒకరైన గంటా శివారెడ్డి మాట్లాడుతూ “ఇది మా వనభోజనాల రెండో సంవత్సరం. గతసారి లాగే ఈసారి కూడా మరింత పెద్ద ఎత్తున నిర్వహించనున్నాం. సుమారు 4,000 నుండి 5,000 మంది వరకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.ప్రతి ఏడాది కార్తీక మాసం సందర్భంగా రెడ్డి వర్గీయులు కుటుంబ సమేతంగా పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజనాలతో ఆనందంగా గడిపే ఈ వనభోజనాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.





