Wednesday, March 18, 2026

*జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం: మహేశ్వరంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు* *ఆరు సంక్షేమ పథకాలే విజయానికి కారణం: దేప భాస్కర్ రెడ్డి* *

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 14:)* జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ *కిచ్చన్న* కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్యకర్తలు, నాయకులు తో కలిసి పెద్ద ఎత్తున టపాసులు (బాణసంచా) పేల్చి, మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.ఘన విజయానికి ఏకైక కారణం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు (ఎల్‌ఓపీ) రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకాలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కాంగ్రెస్‌కు పట్టం కట్టిందని అన్నారు. పథకాలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కాంగ్రెస్‌కు పట్టం కట్టిందని అన్నారు. కుట్రలు తిప్పికొట్టిన ప్రజాతీర్పు: ( బిఆర్ఎస్ ) మరియు బీజేపీ పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఓటర్లు వాటిని తిప్పికొట్టారని, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అభివృద్ధికి పట్టం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని ఆదరించి, విజయాన్ని కట్టబెట్టారని దేప భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో విజయం ఖాయం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ శకం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News