నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……,……………………………..ధరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును సోమవారం తనిఖీ చేసారు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్.ప్రతినెల ఈవీఎం ల తనిఖీ లో భాగంగా గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు.గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత,జగిత్యాల ఆర్డీవో మధుసూదన్,కలెక్టరేట్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ పాల్గొన్నారు.





