Wednesday, March 18, 2026

మోదీ కానుక- పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలోని వడ్లూర్ బేగంపేట ప్రభుత్వ జెడ్పీఏచ్‌ఎస్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు “మోదీ కానుక”గా వచ్చిన 30 సైకిళ్ళను సోమవారం విద్యార్థులకు అందజేశారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అందజేసిన ఈ సైకిళ్లను ప్రధానోపాధ్యాయుడు గోపి కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు సాగేందుకు, రవాణా సమస్యలు లేకుండా పాఠశాలకు సకాలంలో హాజరవడానికి సైకిళ్లు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బుర్ర మల్లేశం గౌడ్, మండల నాయకులు గైని రాజు, సంగా రవి, సాన వేణు, లంకల కిషన్ రెడ్డి, జిల్లా నాయకులు అనిల్, పులి శ్రీకాంత్, కొర్వి అమర్, బుర్ర క్రాంతి, వేంకట రెడ్డి, అన్నడి అజిత్ రెడ్డి, మంకాళి స్వామి అలాగే ఉపాధ్యాయులు పుల్లారు ప్రభాకర్, మారేంద్ర ప్రసాద్, ఒడ్డె భారత్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, హరి శ్రీనివాస్, రాజేందర్, రాధిక, హేమలత, పద్మాదేవి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రమ్యతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News