Thursday, March 19, 2026

పత్రికా ప్రకటన,తేది 19- 11-2025,బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్…

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 19,జిల్లాలోని బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ- జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా స్థానిక సంస్థ హాజరై స్ఫూర్తిదాయక అభిప్రాయంతో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. బాలల హక్కుల సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గాoగ్వర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, ఎస్. డీ.సీ రాజేందర్ గౌడ్, మిషన్ భగీరథ ఈ ఈ రంగారావు, డీ పీ ఆర్ వో ఎం.ఏ. రషీద్, ఇతర శాఖల జిల్లా అధికారులు, డిసిపివో కరిష్మా , చైల్డ్ హెల్ప్ లైన్ సమన్వకర్త నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, సఖి సిబ్బంది ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News