నేటి సాక్షి నారాయణపేట,నవంబర్ 23, నారాయణపేట జిల్లా కేంద్రంలో భజరంగ్ దళ్ – విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి భగవత్ గీతా కంఠస్థ పోటీలలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన శ్రీవాణి పాఠశాల విద్యార్థులు. జిల్లా ఉన్నత స్థాయిలో కృష్ణవేణి మొదటి స్థానం మరియు నరేందర్ రెండవ స్థానం లో నిలిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించడం జరిగింది.అదేవిదంగా మాధ్యమిక స్థాయిలో నిషు మూడవ స్థానం లో నిలవడం జరిగింది. సూపర్ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయికి అర్హత సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం శ్రీమతి & శ్రీ పూర్ణిమ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ వినీతమ్మ , ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియచేయడం జరిగింది.





