నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 24 మండలంలోని దిగువపల్లి పంచాయతీ మిట్టపల్లిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుని మరణించిన సంఘటన చోటుచేసుకుంది ఎస్ఐ నాగేశ్వరరావు కథనమేరకు… దిగువపల్లి పంచాయతీ మిత్రులకు చెందిన గౌతమి 23 బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తుంది ఈ క్రమంలో బెంగళూరులోనే కార్తీక్ అనే యువకుడితో గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉంది పెళ్లి చేసుకోవాలని పెద్దలను అడుగగా ఇరువురి కుటుంబంలోనూ నిరాకరించారు దీంతో మనస్తాపం చెందిన గౌతమి సొంత ఇంటికి వచ్చి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు





