నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 25, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని కన్మనూరు గ్రామ స్టేజి సమీపంలో మంగళవారం నాడు కారు టాక్టరు ఢీకొన్న సంఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మరికల్ పోలీసులు తెలిపారు.





