నేటి సాక్షి న్యూస్:ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం లో శుక్రవారం లోక సుభిక్షం కోరుతూ రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకము అలంకరణ గావించారు. అనంతరం రాహుకాల సమయంలో దంపతుల సమక్షం నందు రాహుకాల అభిషేకాన్ని నిర్వహించారు. పాత కళ్యాణ కట్ట వద్ద భక్తులకు శుక్రవారం ఉచిత అన్న ప్రసాద శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో ఈవో ఏకాంబరం, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.




