నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………………………..జగిత్యాల పట్టణ 25వ వార్డులో 35 లక్షలతో చేపట్టిన అభివ్రుద్ది పనులను స్తానిక నాయకులు,అధికారులతో కలిసి పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్.జగిత్యాల పట్టణంలో అభివ్రుద్ది పనులు నాణ్యత తో చేపట్టాలి అని,అధికారులు నిరంతర పరిశీలన చేపట్టాలని అధికారులకు సూచించారు.జగిత్యాల పట్టణంలో ప్రజలకు సమస్య లేకుండా దాదాపు అన్ని సీసీ రోడ్డు,డ్రైనేజీ పనులు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు.అత్యధిక నిధులు తీసుకువచ్చి,మునుపెన్నడు లేని విధంగా అభివ్రుద్ది పనులు చేపట్టడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల పవన్, AE లు అనిల్,లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.




