నేటి సాక్షి, చిలుకూరు మండలం..గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్లు నవంబర్ 30 నుంచి ప్రారంభం అయినా నేపథ్యంలో కఠిన నియమాలు అమల్లో ఉన్నాయని చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి తెలిపారు.నామినేషన్ వేయడానికి అభ్యర్థి వెంట గరిష్ఠంగా ఇద్దరు మాత్రమే రావాలి అని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులు, ప్రదర్శనలు, అనవసర హడావిడి పూర్తిగా నిషేధించబడినట్టు తెలిపారు.ఎవరైనా ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అలాగే ఆ వివరాలు ఎలక్షన్ కమిషన్కు పంపబడతాయని హెచ్చరించారు. నామినేషన్ వేయబోయే అభ్యర్థులు నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.





