నేటి సాక్షి – జగిత్యాల(పూరెళ్ల బాపు)………………………………….రెండవ విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాయికల్ మండలంలోని ఆలూరు, సారంగాపూర్ మండలంలోని లచక్కపేట గ్రామంలోని సర్పంచి ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ నామినేషన్ల ప్రక్రియను అక్కడ అధికారులతో అడిగి తెలుసుకుని నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తు లను పంపవద్దని అన్నారు.అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అన్నారు. ఎస్పి వెంట డీఎస్పీ రఘు చందర్, రూరల్ సీ.ఐ సుధాకర్ , ఎస్.ఐ లు సుదీర్ రావు ,గీత సిబ్బంది, తదితరులున్నారు.





