నేటి సాక్షి 01 పాములపాడు:-పాములపాడు మండలంలోని,ఇస్కాల గ్రామంలో “ఎన్టీఆర్- భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని, లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య నాయకులు, అధికారులతో కలిసి పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరిగింది.అనంతరం: ఇస్కాల గ్రామ ప్రజలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ రాని వాళ్ళు, పింఛన్లు ఇప్పించాలని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య దృష్టికి తీసుకురావడం జరిగింది.ఎమ్మెల్యే గిత్త.జయసూర్య స్పందిస్తూ, ఎంపీడీవో కి, వీరందరూ అప్లికేషన్లు ఆన్లైన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తహసిల్దార్- జి.సుభద్రమ్మ, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, ఎస్సై కే.సురేష్ బాబు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, టిడిపి బిసి సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడు, వేంపెంట సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, ఈఓఆర్డి సులోచన, పంచాయతీ కార్యదర్శి పి.నాగ శేషులు, టిడిపి నాయకులు హరినాధ రెడ్డి, బండ్లమూరి.వెంకటేశ్వరరావు, భూమా.రాములమ్మ, ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, లింగస్వామి, రుద్రవరం షేక్.కరీం భాష, సురేష్, కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.





