నేటి సాక్షి – కోరుట్ల*గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనారిటీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అలీ నీ ఈ రోజు సమాజ్ వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ పరామర్శించారు.ఆస్పత్రికి వెళ్లి మొహమ్మద్ అలీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి వివరంగా తెలుసుకున్నారు.మహమ్మద్ ముజాహిద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. జర్నలిస్టుల ఆరోగ్యం మరియు భద్రతను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చూడాలని కోరారు. అలీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. మీడియా వర్గాలు సమాజానికి చేస్తున్న సేవలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.—





