నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )పౌర్ణమి ప్రత్యేక ఉత్సవాలుకోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం పౌర్ణమి సందర్బంగా నిర్వహించిన గరుడ సేవ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శోభాయమానంగా జరిగింది. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి స్వామివారి ప్రత్యేక దర్శనం, అభిషేకం, అర్చనలు, గరుడ ఆలంకరణ దార్శనిక సేవలను స్వీకరించారు. ప్రాంతీయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులు కలిసి పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలను అందించారు.*భక్తుల రద్దీ – ప్రత్యేక ఏర్పాట్లు*సాయంత్రం శోభాయాత్రలో స్వామివారి గరుడ వాహన సేవ పట్టణవాసులను అలరించింది. వీధులంతా దీపాలంకరణతో రమ్యంగా మెరిసిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు, తాగునీటి ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలను దేవాలయ సంఘం, పట్టణ పంచాయతీ సంయుక్తంగా సమన్వయం చేసాయి. ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ నిర్వహించే గరుడ సేవ కోరుట్ల ప్రాంతం మొత్తానికి ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువస్తుందని భక్తులు వ్యాఖ్యానించారు.___




