నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 5చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకురాలు శ్రావణిఅమ్మవారికి, అభయాంజనేయ స్వామికి ,నాగభైరవ స్వామికి, ఉదయమే పంచామృత అభిషేకం చేసి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు .చౌడేపల్లి ,పుంగనూరు, చింతామణి ,చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈరోజు ఉభయ దారులుగాచింతామణికి చెందిన శ్రీనివాసులు ధర్మపత్ని రజినీ గా వ్యవహరించారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు





