నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)భారత రాజ్యాంగ నిర్మాత విజ్ఞాన సంపన్నుడు భారతరత్న డా. భీం రావు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ SC మోర్చా జిల్లా నాయకులు మచ్చ విశ్వాస్ ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది..కార్యక్రమంలో ముఖ్య అథితులుగా రామగుండం ఇంచార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేర్గు హన్మంత్ గౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ…మానవాళి ఉన్నంత వరకు అంబేద్కర్ ఆశయాలు కొనసాగుతాయి, బడుగు బలహీనవర్గాల సమాజంలో తలెత్తి భ్రతుకుతున్నారంటే, అణగారిన వర్గాలు వాల్ల హక్కులు దక్కించుకుంటున్నారంటే అది అంబేద్కర్ కృషి అని కొనియాడారు.. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ, జిల్లా నాయకులు జక్కుల నరహరి,అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ రాకేష్, మండల అధ్యక్షులు భూమన్న, అపర్ణ, సీనియర్ నాయకులు జనగామ శివరాం, పంగ రవి,కండె సాగర్, బుంగ మహేష్, దళిత సంఘాల నాయకులు( రెల్లి) ధనాల ప్రకాష్, జక్కుల పద్మ, రాజ్ కుమార్ చారి, కదాసి శంకర్, సాయి పవన్, సునీల్, దిలీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..





