Saturday, March 21, 2026

– ఇదేమి పిచ్చి స్వామి..- ఒక్క వ్యక్తిని నమ్మితే ఇంతలా ఆరాధిస్తారా. ఓ సినిమాలో డైలాగ్ నిజం చేస్తున్న అభిమానులు..- మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ కావాలని శబరిమలై అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 07 ~అన్నమయ్య జిల్లా :-: వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో పలువురు అయ్యప్ప మాల ధరించిన స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన 20 మంది భక్తులు 41 రోజుల కిందట అయ్యప్ప దీక్ష ప్రారంభించారు. దీక్ష ముగియడంతో శబరిమల యాత్రకు వెళ్లిన వీరంతా అక్కడ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆలయానికి చేరుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పను ప్రార్థించారు. అలాగే తాజాగా వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ అయ్యప్ప భక్తులతో కలిసి జగన్ ఫ్లెక్సీతో తిరువూరు ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా రాము కొండకు పాదయాత్రగా వెళ్లారు. జగనన్న మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం బాగుంటుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని రాము ఆకాంక్షించారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News