నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 9,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని జిన్నారం గ్రామంలో ఆరో వార్డు సభ్యులుగా రఘుపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పట్ల మంగళవారం నాడు గ్రామస్తులు అభినందించారు. అదేవిధంగా జిన్నారం గ్రామంలోని వెంకటేశ్వరమ్మ వెంకటేష్ గౌడ్ ల ఆధ్వరంలో జోరుగా గ్రామంలో ప్రచారం నిర్వహించారు. తమ ఓట్లను కత్తెర కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి సహకరిస్తానని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమలమ్మ, చెన్నప్ప,, తిమ్మన్న, కాజా, సత్యం, కృష్ణయ్య నరసింహులు,భీమేష్,బాలు, లక్ష్మీ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.





