Friday, March 20, 2026

*రుద్రంగి మానాల చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.*

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ నందు అధికారులు,సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను పరిశీలించారు.ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద పనిచేసే అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు.ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా జరిగే నగదు,మద్యం వంటి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా అధికారులు భాద్యతగా వ్యవహారించాలని అన్నారు.జిల్లా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఎస్పీ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు,ఎస్.ఐ శ్రీనివాస్ ,సిబ్బంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News