నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 14, నారాయణపేట జిల్లాలోని మరికల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రామ సర్పంచ్ ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపతి చెన్నయ్య 355 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగిందని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గొల్ల కృష్ణయ్య, బెలకొంది వీరన్న, కటికే కాజా, మరికల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు అన్వర్, నాయకులు రామన్ గౌడు, రామకృష్ణారెడ్డి రామకృష్ణ, బొంత మొగులయ్యలు హర్షం వ్యక్తం చేస్తూ బాణ సంచాలను కాల్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరు భారీ సంఖ్యలో హాజరయ్యారు.





