నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 15, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని రా కొండ గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని రాకుండా గ్రామ సర్పంచ్ గాదం పెద్ద పుల్లప్ప అన్నారు. సోమవారం నాడు రా కొండ గ్రామంలోని దళిత వార్డు ను సందర్శించారు. ఈ సందర్భంగా రాకుండా గ్రామ సర్పంచ్ పెద్దపుల్లప్ప మాట్లాడుతూ దళిత వాడలో డ్రైనేజీ సిసి రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన గ్రామస్తులను కోరారు.





