Wednesday, March 18, 2026

*గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం*•తారు రోడ్లతో గ్రామీణ రహదారులకు కళ•శరవేగంగా బొల్లాపల్లి రహదారి నిర్మాణం•ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగా జాతీయ రహదారి ఎన్‌హెచ్–16 నుంచి బొల్లాపల్లి గ్రామానికి రూ.65 లక్షల వ్యయంతో తారు రోడ్డు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయని, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ తారు రోడ్డు నిర్మాణంతో గ్రామాల మధ్య రవాణా సౌలభ్యం గణనీయంగా పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే అవకాశం కలుగుతుందని, విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లేందుకు అనుకూలంగా మారుతుందని తెలిపారు. అలాగే అత్యవసర సేవలు గ్రామాలకు వేగంగా చేరుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.గ్రామీణ రహదారుల అభివృద్ధి వల్ల గ్రామాల రూపురేఖలు మారుతాయని ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.భవిష్యత్తులో కూడా రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News