నేటి సాక్షి 17 పాములపాడు:-పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త బోనపల్లె ఫ్రాన్సిస్ ని మాజీ సర్పంచ్ టేకూరి. రామసుబ్బమ్మ, సింగపూర్ టేకూరి.నాగేశ్వరావు సతీమణి టేకూరి.రేణుక లు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ అన్నారు. అనంతరం ఆయన కుటుంబానికి సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్. నాగేశ్వరావు తరపున మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, ఆయన సతీమణి టేకూరి.రేణుక, కుమారులు కుందన్, యువ లు పండ్లు ఇచ్చి, 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందించి, భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేంపెంట గ్రామ మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్,సుబ్బారావు,సురేష్,దార జీవన్న,చిట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.





