– నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 19~అన్నమయ్య జిల్లా -:- తిరుమల పరకామణి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపులో పూర్తి పారదర్శకత ఉండాలని స్పష్టం చేసింది. కానుకల లెక్కింపులో ఏ చిన్న తప్పు జరిగినా అది కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది. మోసాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీదే..———————————————తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగినా అది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి సంఘటనలకు పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుదేనని స్పష్టంగా పేర్కొంది. పరకామణిలో జరిగే కానుకల లెక్కింపును పూర్తిగా ఆధునిక సాంకేతికతతో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. లెక్కింపు ప్రక్రియలో ఏవన్ టెక్నాలజీ, కంప్యూటర్లు, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించింది. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి, చివరి పైసా వరకు ఖచ్చితంగా లెక్కలోకి రావాలని కోర్టు పేర్కొంది. చోరీలు, మోసాలు, అవకతవకలు చోటుచేసుకోకుండా చూడటం టీటీడీ బాధ్యతనని హైకోర్టు స్పష్టం చేసింది. పరకామణి లెక్కింపులో పర్యవేక్షణ వ్యవస్థ బలంగా ఉండాలని, ప్రతి దశను రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. లెక్కింపు సమయంలో వీడియో రికార్డింగ్, డేటా నిల్వ, ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా పూర్తి ట్రాకింగ్ జరగాలని సూచించింది. దీని ద్వారా భక్తుల నమ్మకం మరింత బలపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తక్షణమే ఈ చర్యలను అమలు చేయాలని హైకోర్టు టీటీడీ బోర్డును ఆదేశించింది. ఆధునిక టెక్నాలజీని వినియోగించి పరకామణి వ్యవహారంలో సంపూర్ణ పారదర్శకత తీసుకురావాలని, ఆలస్యం చేయకుండా అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది..~~~~~~~~~~~~~~~~~~





