నేటి సాక్షి 20 పాములపాడు :—వికసిత్ జి రాంజీ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన గోకులం షెడ్లను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి ఎం వి ఎన్ రాజు ఆదేశించారు పాములపాడు గ్రామంలోని చిన్న స్వాములు లబ్ధిదారుడు నిర్మిస్తున్న గోకులం షెడ్లను శనివారం ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మినీ గోకులం షెడ్లలో ఆరు పశువులు ఉండే విధంగా లబ్ధిదారులు నిర్మించుకోవాలన్నారు 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే సబ్సిడీ లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్ ఏపీవో జయంతి ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు





