నేటిసాక్షి, కరీంనగర్: ప్రస్తుత పోటీప్రపంచంలో విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కావద్దని, అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సీతారాంపూర్లోని ఐవీవై పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫౌండర్ పసుల మహేష్, కోచైర్మన్ దాసరి శ్రీపాల్రెడ్డి, జయశ్రీ, మాలతి తదితరులు పాల్గొన్నారు.

