Friday, February 13, 2026

*వేంపెంట గ్రామంలో మృతి చెందిన దండగల.భూషమ్మ కుటుంబానికి సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరఫున 5వేలు ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ* .

నేటి సాక్షి 13 ఫిబ్రవరి పాములపాడు:- పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో దండగల భూషమ్మ మృతి చెందిన విషయం తెలుసుకోని, మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, గ్రామ నాయకులతో కలిసి ఆమె పార్తివదేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబానికి సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరఫున 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ధైర్యంగా ఉండాలని మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బోనాల భాస్కర్, జనసేన శేషు, తాటిపాటి నాయుడు, మద్దూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News