నేటి సాక్షి నారాయణపేట , మార్చు 31, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని పాత ఆర్ ఐ కార్యాలయం చెత్తకుప్పల మారిందని మరికల్ పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇటు నుంచి వెళ్లే ప్రయాణికులు దుర్వాసనను భరించలేకపోతున్నారని మరికల్ పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి ఆర్ఐ కార్యాలయంలో పేరుకుపోయిన చెత్త కుప్పను తొలగించాలని నారాయణపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ జిల్లా కలెక్టర్ ను కోరారు లేనియెడల వారంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.




