
నేటి సాక్షి,మెట్ పల్లి.(నరేష్.దూలురీ):
మెట్ పల్లి పట్టణ పరిధిలోని వెంకటరావుపేట శివారులో శనివారం కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురికి గాయాలు కాగా,ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణంలోని ఆదర్శనగర్ కు చెందిన నాంపల్లి లక్ష్మీ నర్సయ్య కేబుల్ టీవీ నడుపుతారు.నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి సమీపంలోని ఆలయానికి లక్ష్మీ నరసయ్య తన బంధువులు శాంత, శారద,వైష్ణవి తో కలిసి దైవ దర్శనానికి వెళ్లారు.తిరుగు ప్రయాణంలో కారులో వస్తుండగా వెంకట్రావుపేట శివారులో అదుపు తప్పి కారు బోల్తా పడింది.ఈ సంఘటనలో నలుగురికి గాయాలు కావడంతో స్థానికులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వీరిలో శాంతకు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.