నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల): ఎస్ఆర్ పురం మండలం మర్రిపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనం లో వ్యక్తి అదుపుతప్పి పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనం ద్వారా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎన్ టివి రిపోర్టర్ తిరుమల స్వయంగా చిత్తూరు ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మానవత్వం చాటుకున్నాడు. అతనికి చికిత్స అందించి కుటుంబ సభ్యులకు అప్పగించారు కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.





