Sunday, March 15, 2026

రథసప్తమి ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష

నేటి సాక్షి తిరుపతి జిల్లా, (బాదూరు బాల) : ఫిబ్రవరి 04 న తిరుమలలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టిటిడి జేఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో ఇంఛార్జి శ్రీ మణికంఠ చందోలుతో కలిసి భద్రత, జన రద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు. టిటిడి వివిధ విభాగ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ మరియు పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సమగ్ర బందోబస్త్ పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
అన్నప్రసాదం, పారిశుద్ధ్యం , శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు మరియు ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. అంతకు మునుపు ఆయన శ్రీవారి మెట్టు టోకెన్లు పై కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు లు వర్చువల్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ సత్యనారాయణ, తిరుమల అదనపు SP శ్రీ రామకృష్ణ, GM IT శ్రీ శేషారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం మరియు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News